Janasena: తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన..

Update: 2023-07-17 08:30 GMT

తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నేత కొట్టే సాయిపై సీఐ దాడి, అనుచిత వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఇటీవల ఓ నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడికి పాల్పడ్డారు.శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.నిరసనను ఆపివేసేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. 


Tags:    

Similar News