జనసేన వారాహి యాత్ర ఐదోరోజు కాకినాడ రూరల్లో కొనసాగనుంది.. ఈరోజు సాయంత్రం సర్పవరంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.అయితే, పవన్ పర్యటనపై వైసీపీ నేతలు మాటల దాడి చేస్తున్నారు.దీనికి జనసేన నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్ బహిరంగ సభను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని జనసేన నేత పంతం నానాజీ ఆరోపించారు.సభను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.