జపాన్లోని నాగో నగరంలో నది ఒక్కసారిగా ముదురు ఎరుపు రంగులోకి మారింది. దీంతో నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇక్కడున్న ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీకి చెందిన కూలింగ్ వ్యవస్థల్లో ఏర్పడిన లీకేజీనే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో ఆహారపదార్థాల్లో ఉపయోగించే రంగు పొరపాటున లీక్ అయింది.అది నదిలోకి విడుదల కావడంతో నీరంతా ముదురు ఎరుపురంగులోకి మారిపోయింది. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవంటోంది ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యం.అలాగే క్షమాపణలు తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.