Jitendhar Reddy: వివాదస్పదంగా మారిన ట్వీట్..

Update: 2023-06-29 08:00 GMT

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదస్పద ట్వీట్ కలకలం రేపింది. గేదెను తన్నే వీడియోను ట్వీట్ చేసిన జితేందర్‌ రెడ్డి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ కామెంట్‌ పెట్టి, అమిత్ షా, బీఎల్ సంతోష్‌కు మాజీ ఎంపీని ఈ ట్వీట్‌ కు ట్యాగ్ చేశారు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. బండి సంజయ్‌ నాయకత్వాన్ని ప్రశ్నించేవారికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ట్వీట్‌ చేశారు. 

Tags:    

Similar News