ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా బట్టబయలు చేసింది టీవీ5.గుట్టుగా ఇంటి పేరు మార్చి.. ఏమార్చి కిడ్నీ దోచేసిన వైనాన్ని టీవీ5 బయట పెట్టడంతో స్పందించిన అధికారులు ప్రధాన నిందితుడు ఉదయ్కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కృష్ణాజిల్లా నిడమర్రుకు చెందిన ఉదయ్కిరణ్ సామాన్య,మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా చేసుకొని.. ఓ దళిత మహిళ కిడ్నీని దోచేసింది ఈ ముఠా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మాయ మాటలు చెప్పి వారి కిడ్నిలను అమ్మేసుకుంటున్నారు.ఈ కేసులో బ్రోకర్ ప్రసాద్ కోసం గాలింపు కొనసాగిస్తున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.