తెలంగాణ కాంగ్రెస్ని ఓ పోకిరీ చేతిలో పెట్టారంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్గా అభివర్ణించారు. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించడం బాధాకరమని ట్వీట్ చేశారు. రేవంత్రెడ్డి అనుచరులమంటూ కొందరు తనకు కాల్ చేసి బెదిరించారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. దీనిపై సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్ ట్వీట్పై.. మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.