హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజ బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని, మహాంకాళీ అమ్మవారి శిఖర పూజా, ద్వజారోహనంతో పాతబస్తీలో బోనాల సందడి మొదలైయింది. శిఖరపూజలో సీపీ ఆనంద్ పాల్గొన్నారు. ప్రతీ ఏడాది ఆనవాయితీగా శిఖరపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సీపీ ఆనంద్. ఓల్డ్ సిటీలో బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సీపీ ఆనంద్. జూలై 17న భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది.