జనసేన అధినేత పవన్కళ్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్కళ్యాణే పెద్ద రౌడీ..పెద్ద గుండా అంటూ వెల్లడించారు. జనసేనలో ఉన్నవాళ్లంతా రౌడీలు, గుండాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్పైనే రౌడీకేసులు ఉండి ఉండొచ్చని మంత్రి బొత్స అన్నారు. అలాగే విశాఖ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్పై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్ ఎలా జరిగిందో విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో విశాఖలో రౌడీ అనే వాడే లేకుండా చేస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త విశాఖను మీరు చూస్తారని మంత్రి వెల్లడించారు.