ఊహించనిస్థాయిలో వరదలొచ్చాయి: పువ్వాడ అజయ్‌

Update: 2023-07-28 11:46 GMT

ఊహించని స్థాయిలో వరదలొచ్చినా ప్రాణనష్టాన్ని నివారించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. భద్రాచలంలో 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. మున్నేరు చరిత్రలో ఇంతటి వరద ఉధృతిని ఎన్నడూ చూడలేదన్నారు. వరద ఎంత వేగాంగా వచ్చిందో...అంతే వేగంగా వెళ్లిందని మంత్రి తెలిపారు. వరదల సమయంలో జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బాగా పనిచేశాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న చివరి వ్యక్తికి వరకు రక్షించినట్టు పువ్వాడ అజయ్‌ వివరించారు.

Tags:    

Similar News