మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ మండలంలోని చౌట్లపల్లిలో, కూలీలతో కలిసి వరినాట్లు వేసారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. మహిళా రైతుల కష్టాలను అడిగితెలుసుకున్నారు. రైతు బంధు, కరెంటు సమస్యలపై ఆరా తీసారు పద్మాదేవేందర్ రెడ్డి. వరినాట్లు వేస్తూ మహిళలు పాటలు పాడగా, వారితో కలిపి గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి వరినాట్లు వేయండం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.