ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని బహుమతిగా ఇచ్చారు మోదీ. అలాగే మెక్రాన్ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను అందజేశారు. దీంతో పాటు కాశ్మీరీ కార్పెట్ను బహూకరించారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీకి సైతం పలు బహుమతులను మెక్రాన్ అందజేశారు.