యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం రుద్రవెల్లి, పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు మూసి వాగు దాటవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మూసి పరివాహక ప్రాంతాల రైతులను అప్రమత్తం చేశారు.