కోడుమూరు: యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 94వరోజు (మంగళవారం) కోడుమూరు నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా కోడుమూరు ప్రజలు యువనేతకు ఘనస్వాగతం పలికారు.కోడుమూరు నియోజకవర్గం పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర గార్గేయపురం శివారు విడిది కేంద్రానికి చేరుకుంది.