టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు యార్లగడ్డ వెంకట్రావుని గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించారు నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో ఉన్న పిల్ల సైకోని గుడివాడలో ఉన్న సన్న బియ్యం సన్నాసిని ఓడిస్తామని శపథం చేశారు. ఇదే కోవలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున కీలక వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఇందులో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్ లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గ నేతలు ఉన్నారు.