పెరిగిన టమాట ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ టమాట 120 రూపాయల నుంచి 200 పలుకుతోంది. దీంతో కర్నూలు జిల్లాలో మార్కెటింగ్ శాఖ రాయితీలో కేజీ టమాటను 50 రూపాయలకే అందిస్తోంది. దాంతో ఆదోనిలో టమాటల కోసం ప్రజలు కుస్తీ పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోమీటర్ మేర క్యూలైన్ ఉంది. అయితే సంబంధిత అధికారులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.