ఏపీలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికంటూ మరోసారి జనసేనాని పవన్కల్యాణ్ విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయిందని పవన్ ఆరోపించారు.జగన్ భాష చూస్తుంటే చిరాకేస్తోందని ఆయన్ను ఇంటికి పంపే రోజు వచ్చిందని అన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తానని కామెంట్స్ చేశారు.