వారాహి విజయ యాత్ర సందర్భంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. దీంతో ఇవాళ చంద్రశేఖర్రెడ్డి సైతం.. పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన నేతలు, వీర మహిళలు విరుచుకుపడుతున్నారు. కాకినాడను గంజాయి హబ్గా మార్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డా తమ నేత గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.