మాయమాటలతో తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మభ్యపెడుతున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఏం సాధించారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్కు ప్రజలు, ఉద్యమకారులు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు శంకరమ్మ ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.