వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన రాహుల్ దేశంలో పేదల కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పని చేస్తోందన్నారు. బీజేపీ కొద్ది మందికి మాత్రమే లబ్ది చేకూర్చుతోందని రాహుల్ విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించాలంటే ఐక్యత ఒక్కటే మార్గమన్నారు.