సీఎం జగన్పై రాయలసీమ స్టీరింగ్ కమిటీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. జగన్ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. తాడో పేడో తేల్చుకునేందుకు.. ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చామన్నారు. చిత్తూరు నుంచి కర్నూలు వరకు రాయలసీమ నాయకులంతా ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరారు.