తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ కాలరాశారు :రేవంత్ రెడ్డి

Update: 2023-06-22 05:30 GMT

తెలంగాణ వనరుల్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ కాలరాశారని ఆరోపించారు. తెలంగాణ పేరే లేకుండా కేసీఆర్‌ కుట్ర చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News