అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు వైజాగ్ నుంచి పాడేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ చెట్టుకొమ్మను తప్పించబోయి..స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో లోయలోకి దూసుకెళ్లింది. అమ్మవారి పాదాలు, వ్యూపాయింట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.