మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కాస్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వెళ్తున్న రెండు కంటైనర్లు అదుపుతప్పి ఒకదాన్ని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ కంటైనర్లోని గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది.పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.