విశాఖ గోపాలపట్నంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్పై నుంచి పడి ఓ రౌడీషీటర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పెందుర్తికి చెందిన షన్ముఖ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి లాడ్జ్లో అర్ధరాత్రి మద్యం సేవించాడు. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో లాడ్జ్ బాయ్ మధు రూం ఖాళీ చేయమన్నాడు. దీంతో అతనిపై దాడి చేశారు. వెంటనే మధు లాడ్జ్ రూంకు తాళం వేశాడు. విషయాన్ని పోలీసులకు చెబుతాననడంతో భయపడిపోయిన షన్ముఖ్ మద్యం మత్తులో కిందకు దూకేశాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు.