భారీ వర్షాలకు గన్నవరం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు చెరువులను తలపిస్తున్నాయి. చినుకు పడితే చాలు పాఠశాలల్లో మోకాళ్లలోతు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. తేలపోలు ప్రభుత్వ స్కూల్ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. వరద నీటిలోనే నడుచుకుంటూ విద్యార్థులు స్కూల్కు వెళ్తున్నారు. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నాడు నేడు పేరుతో ఆర్భాటాలు తప్పా చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ గాలి మాటలకే పరిమితం అయ్యిందని... విద్యార్థులు నరకయాతన పడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.