హైదరాబాద్లో కుండపోతవ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో అల్వాల్ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో ఇళ్లలోకి పాములు చేరుతున్నాయి. అయితే అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో స్థానికులు వినూత్న నిరసనకు దిగారు. సంపత్ కుమార్ అనే వ్యక్తి ఓ పామును తీసుకెళ్లి అల్వాల్ GHMC వార్డు ఆఫీసులో వేసి నిరసన తెలిపాడు. టేబుల్ పై పాము వేయడంతో అధికారులు పరుగులు తీశారు.