ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు సోనియా గాంధీ ఫోన్ చేశారు. ఎన్సీపీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్తో సోనియా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ తోనే ఉంటుందని సోనియా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మరోవైపు పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటు వ్యవహారంపై ఎన్సీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.