యాదాద్రి రైల్వేస్టేషన్ను సందర్శించారు, సౌత్ సెంట్రల్ జీఎం అరుణ్ కుమార్ జైన్. రైల్వే స్టేషన్లో వసతులు సరిగా లేవని స్థానికులు అరుణ్ కుమార్ దృష్టికి తీసుకు రావడంతో, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైల్వే అధికారులకు సమస్యలను వివరించి, వినతి పత్రాన్ని అందించారు భువనగిరి మున్సిపల్ చైర్మన్. త్వరలో ఎంఎంటీఎస్ రానుందని, అందుకోసం స్థలం పరిశీలన జరుతుందన్నారు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.