తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నటీ యూనివర్సిటీ, 12వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఛాన్సిలర్ హోదాలో విద్యార్ధులకు పట్టాలను ప్రధానం చేసారు గవర్నర్ అబ్దుల్ నజీర్. 366 మంది విద్యార్ధులకు డిగ్రీ పట్టాలు,37 మంది విద్యార్ధులకు గోల్డ్ మెడల్స్, ఇద్దరికి సిల్వల్ మెడల్స్ ప్రదానం చేసారు. వృత్తిని గౌరవించాలని, పశువైద్య నీతి సూత్రాకలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. దేశీయ ఆవులను సంరక్షించేందుకు టీటీడీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.