అనంతపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తత దారి తీసింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకొని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.