హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఉదయం నుంచి ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.. సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్స్కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.. కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెడుతున్నారని ఫైరవుతున్నారు..