తిరుపతి ఎస్వీయూలో రోడ్ల విస్తరణపై వివాదం కొనసాగుతుంది. ప్రశాంతతను దెబ్బతీసే, పర్యావరణాన్ని కలుషితం చేసేలా వ్యవహరిస్తే ప్రాణాలర్పించైనా రోడ్డును అడ్డుకుంటామని విద్యార్ధులు అంటున్నారు. విద్యార్ధులకు సంఘీభావంగా గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైయ్యారు బీజేపీ నేతలు. మరోవైపు ఎస్వీయూలో సమావేశమైన పూర్వ విద్యార్థులు రోడ్ల విస్తరణ ఆపాలంటూ సంతకాల సేకరించారు. విద్యార్ధుల ఆందోళన ఉదృతం కావడంతో వైస్ఛాన్స్లర్ వెనక్కి తగ్గారు SVUలో రోడ్ల విస్తరణ అవసరం లేదని ప్రకటించారు.