తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు GSN కన్వెన్షన్ హాల్లో స్వాతంత్ర సమయోధుడు.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్థార్ గౌతులచ్చన్న 115వ జయంతి నిర్వహించారు. గౌతు లచ్చన్న విగ్రహానికి, ఎన్టీఆర్ చిత్ర పటానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. చిన్నారులను ఎత్తుకుని ఆశీర్వదించారు. చంద్రబాబుతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహం చూపించారు.