విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. జగన్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సంక్షేమ పథకాలతో పెరుగుతున్న అప్పుల ముప్పు నుంచి కాపాడేది చంద్రబాబు అంటూ ప్రజలకు వివరిస్తున్నారు. జింక్ ఏరియాలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఎమ్మెల్యే గణబాబు బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.