మాజీమంత్రి అనిల్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఫైర్ అయ్యారు. అనిల్ను గుడిలోకి వెళ్లిఅబద్దాలు చెప్పమనలేదని అన్నారు. పవిత్ర దేవాలయాన్ని తన రాజకీయ స్వార్థాలకు.అనిల్ వాడుకుంటున్నాడని మండి పడ్డారు.అనిల్ పీఏ నాగరాజు, స్నేహితుడు చిరంజీవి పేర్ల మీద ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అన్ని చెప్పిన ఆయన సౌత్ అమెరికా పేరుతో గోల్డ్ మైనింగ్ గురించి మరిచిపోయాడని ఆరోపించారు. బాబాయ్తో బెట్టింగుల్లో వాటాలు తీసుకున్నారని తేడా రాగానే చేతులెత్తేశారని విమర్శించారు.