జగన్ సర్కార్పై టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. అంగళ్లు ఘర్షణలకు అసలు కుట్రదారులు జగన్, పెద్దిరెడ్డి,ఎస్పీ రిశాంత్రెడ్డినే నని అన్నారు. కేసులు మాపై కాదు..అసలైన కుట్రదారులపై పెట్టండని పోలీసులకు సూచించారు.తప్పుడు కేసులతో టీడీపీ నేతలు ఏం చేయలేరని అన్నారు. టీడీపీకి చెందిన 13 కార్లు ధ్వంసం చేసి తిరిగి తమ పైనే కేసులా..? అని ప్రశ్నించారు.ఎస్పీ రిశాంత్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..20 మందిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు