మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి జిల్లాలో యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడినపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు.