ఏపీలో సర్పంచ్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సర్పంచ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ కమిషనరేట్ ముట్టడికి సర్పంచ్లు యత్నించారు.15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చి 40 రోజులు అవుతున్నా నేటికి నిధులు విడుదల చేయకపోవడంపై భగ్గుమన్నారు. నెలల తరబడి గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు పెండింగ్లో ఉన్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 691 కోట్లను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. తమ గౌరవ వేతనం 3వేల నుంచి 15వరకు చెల్లించాలన్నారు.