Missing: అల్లూరి జిల్లా ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్ధునులు అదృశ్యం

Update: 2023-09-01 09:28 GMT

అల్లూరి జిల్లా చింతపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్ధునులు అదృశ్యమయ్యారు. పోలీసులకు ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పాంగి గాయత్రి, గెమ్మిల నీరజ, 5వ తరగతి చదువుతున్న పాంగి గీత అనే ముగ్గురు విద్యార్ధునులు మంగళవారం సాయంత్రం ఉపాధ్యాయుల అనుమతి లేకుండా పాఠశాల నుంచి బయటికి వెళ్లిపోయారు. తోటి విద్యార్ధులు ఆరా తీయగా బంధువుల ఇంటికి వెళుతున్ననట్లు చెప్పినట్లు తెలిపారు. బంధువుల ఇళ్లకు వెళ్లి వాకబు చేయగా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News