Nandamuri Padmaja : నందమూరి కుటుంబంలో విషాదం..

Update: 2025-08-19 08:45 GMT

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సోదరి కావడంతో, దగ్గుబాటి కుటుంబంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Tags:    

Similar News