మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.. ఆయన ఇవాళ బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు.. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.. బీసీలకు పెద్దపీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘతన ఎన్టీఆర్దయితే.. బీసీల రిజర్వేషన్లు కుదించిన చరిత్ర కేసీఆర్ది అని మండిపడ్డారు.