వైసీపీ సర్కార్ విద్యావిధానంపై TSNF ఫైర్ అయింది. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి నిధుల్లో కోతపెట్టడం దారుణమని, నవరత్నాలను ఖురాన్, బైబిల్తో పోల్చిన సీఎం జగన్..నవ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 5లక్షల మంది విద్యకు దూరమైయ్యారని ఆరోపించారు. 2 లక్షల మంది విద్యార్ధులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అందడం లేదని.. దీంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు TSNF నేతలు.