దేశంలో కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో టమోటా ధర 150 రూపాయలు క్రాస్ అయ్యింది. ఇక ఖమ్మంలో పచ్చి మిర్చి రేట్లు భగభగమంటున్నాయి. బీరకాయ, బీన్స్, వంకాయ, అల్లం, వెల్లులికి సైతం రెక్కలు వచ్చాయి. పెరిగిన ధరల కారణంగా రైతు బజార్కు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.