ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు భయపడినట్లే జరుగుతోంది. కర్నూలు జిల్లాలో ఇవాళ జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలోని కోట కందుకూరు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు స్లిప్లు రాస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద స్లిప్లు రాస్తున్నవారి వీడియోలను విడుదల చేశారు. ఇదే వీడియోను అధికారులకు పంపినట్లు ఆమె తెలిపారు.