గడప గడపకు కార్యక్రమంలో వైసీపీకి నిరసన సెగలు తగులుతున్నాయి. సమస్యలపై అడుగడుగునా వైసీపీ నేతలను స్థానికులు నిలదీస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లికి నిరసన సెగ తగిలింది. గ్రామాల్లో పర్యటిస్తున్న నేదురుమల్లిపై స్థానికుల ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యపాన నిషేదంపై మహిళలు నిలదీశారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు నేదురుమల్లి. ఇక 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫించన్లు రావడం లేదని మరో వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.