వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలన్నారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హుడిగా చేయడానికి వైకాపా నేతలు ప్రయత్నించిన వారు ఆశించిన ఫలితం రాలేదన్నారు. నరసాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషిచేస్తానన్నారు.