ind-pak: భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ రద్దు

అధికారికంగా ప్రకటించిన డబ్ల్యూసీఎల్... పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా విముఖత.. పహల్గామ్‌ దాడి నేపథ్యంలో క్రికెటర్ల నిర్ణయం;

Update: 2025-07-21 02:00 GMT

భా­ర­త్ - పా­కి­స్థా­న్ మధ్య జర­గా­ల్సిన క్రి­కె­ట్ మ్యా­చ్‌ రద్దు అయిం­ది. వర­ల్డ్ ఛాం­పి­య­న్‌­షి­ప్ ఆఫ్ లె­జెం­డ్స్ (WCL) టో­ర్న­మెం­ట్‌­లో భా­గం­గా జర­గ­ను­న్న ఆ మ్యా­చ్​­కు భారత ఆట­గా­ళ్లు పా­కి­స్థా­న్ ఆడ­బో­మ­ని ప్ర­క­టిం­చిన నే­ప­థ్యం­లో ఆ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు ని­ర్వా­హ­కు­లు తె­లి­పా­రు. తమ ని­ర్ణ­యం­తో అభి­మా­ను­ల­ను ని­రా­శ­ప­ర్చి­నం­దు­కు, భారత ఆట­గా­ళ్ల­కు అసౌ­క­ర్యం కలి­గిం­చి­నం­దు­కు ని­ర్వా­హ­కు­లు క్ష­మా­ప­ణ­లు తె­లి­పా­రు.

"మేం WCL­లో క్రి­కె­ట్‌­ను ఎంతో ప్రే­మ­తో ని­ర్వ­హి­స్తు­న్నాం. అభి­మా­ను­ల­కు మంచి, సం­తో­ష­క­ర­మైన క్ష­ణా­ల­ను అం­దిం­చ­డ­మే మా ఏకైక లక్ష్యం. ఇటీ­వల పా­కి­స్థా­న్ హాకీ జట్టు భా­ర­త­దే­శా­ని­కి వస్తుం­ద­న్న వా­ర్త­లు వచ్చా­యి. అలా­గే భా­ర­త్- పా­కి­స్థా­న్ మధ్య జరి­గిన వా­లీ­బా­ల్ మ్యా­చ్‌­తో పాటు ఇతర క్రీ­డ­ల్లో జరి­గిన కొ­న్ని పో­టీ­ల­ను చూ­శాం. డబ్ల్యూ­సీ­ఎ­ల్​­లో కూడా భా­ర­త్-పా­కి­స్థా­న్ మ్యా­చ్‌­ను ని­ర్వ­హిం­చా­ల­ని అన­కు­న్నాం. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా అభి­మా­ను­ల­కు సం­తో­ష­క­ర­మైన జ్ఞా­ప­కా­ల­ను అం­దిం­చా­ల­ని అను­కు­న్నాం. కానీ ఈ ప్ర­య­త్నం చాలా మంది భా­వో­ద్వే­గా­ల­ను గా­య­ప­రి­చి­న­ట్టు అని­పి­స్తోం­ది. మేం ఎవరి మనో­భా­వా­ల­ను బా­ధిం­చా­ల­న్న ఉద్దే­శం­తో చే­య­లే­దు. కానీ ఈ పరి­ణా­మాల వల్ల బాధ కలి­గిం­చి­నం­దు­కు చిం­తి­స్తు­న్నాం" అని డబ్ల్యూ­సీ­ఎ­ల్ అధి­కా­రి­కం­గా వె­ల్ల­డిం­చిం­ది. టీ­మిం­డి­యా మాజీ క్రి­కె­ట­ర్లు పా­క్‌­తో మ్యా­చ్‌ ఆడేం­దు­కు వి­ము­ఖత చూ­ప­డ­మే ఇం­దు­కు కా­ర­ణ­మ­ని ని­ర్వా­హ­కు­లు తె­లి­పా­రు. హర్భ­జ­న్, ధా­వ­న్, రైనా, యూ­సు­ఫ్ పఠా­న్ సహా మరి­కొంత మంది భారత ఆట­గా­ళ్లు మ్యా­చ్ నుం­చి వై­దొ­లి­గా­రు. అయి­తే భా­ర­త్, పా­కి­స్తా­న్ జట్ల­కు చె­రొక పా­యిం­ట్‌ ఇచ్చా­రా? లేదా? అన్న దా­ని­పై డబ్ల్యూ­సీ­ఎ­ల్ ని­ర్వా­హ­కు­లు స్ప­ష్టత ఇవ్వ­లే­దు.

 కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

పహ­ల్గాం దాడి తర్వాత కేం­ద్ర ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్న వి­ష­యం తె­లి­సిం­దే. దా­యా­ది పా­కి­స్థా­న్‌­తో ఏ క్రి­కె­ట్‌ ఆడ­కూ­డ­ద­ని బీ­సీ­సీ­ఐ­కి స్ప­ష్టం చే­సిం­ది. మా­జీ­లు ఆడే డబ్ల్యూ­సీ­ఎ­ల్‌­లో ఇండో-పాక్ టీ­మ్స్ తల­ప­డ­ను­న్న నే­ప­థ్యం­లో సో­ష­ల్ మీ­డి­యా­లో చాలా వి­మ­ర్శ­లు వచ్చా­యి. పా­క్‌­తో మ్యా­చ్‌ ఆడేం­దు­కు టీ­మిం­డి­యా మా­జీ­ల­కు ఎవరు అను­మ­తి ఇచ్చా­రు?, దేశం గు­రిం­చి కా­స్తై­నా ఆలో­చిం­చ­క్క­ర్లా? అంటూ ప్ర­శ్నల వర్షం కు­రి­సిం­ది. కొం­ద­రు ప్లే­య­ర్స్ తాము మ్యా­చ్ ఆడ­లే­మ­ని డబ్ల్యూ­సీ­ఎ­ల్ ని­ర్వా­హ­కు­ల­కు ముం­దే చె­ప్పా­రట. చి­వ­ర­కు మ్యా­చ్‌ రద్దు అయిం­ది. నేడు జరి­గే మ్యా­చ్‌ రద్ద­యిం­ద­ని, డబ్బు­లు వా­ప­స్ ఇస్తా­మ­ని డబ్ల్యూ­సీ­ఎ­ల్‌ ని­ర్వా­హ­కు­లు స్ప­ష్టం చే­శా­రు.

Tags:    

Similar News