KHAWAZA: క్రికెట్‌కు ఖవాజా గుడ్ బై

కన్నీటితో వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్

Update: 2026-01-02 13:00 GMT

 ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే సిడ్నీ టెస్ట్ తనకు చివరి మ్యాచ్ అని తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియా జట్టులో ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ వివక్షను తాను భరించలేకపోతున్నానని, ఇక ఆడలేనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌)తో జరగబోయే ఐదో యాషెస్ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన 39 ఏళ్ల ఖవాజా, భావోద్వేగపూరితమైన ప్రసంగంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు.

అయి­తే, ఉస్మా­న్ ఖవా­జా తన టె­స్ట్ కె­రీ­ర్‌­ను 2011లో సి­డ్నీ వే­ది­క­గా­నే ఇం­గ్లాం­డ్‌­పై ప్రా­రం­భిం­చా­రు. సరి­గ్గా 15 ఏళ్ల తర్వాత అదే మై­దా­నం­లో, మళ్లీ అదే జట్టు­తో ఆడి ఆటకు స్వ­స్తి పల­క­డం ఒక అరు­దైన మై­లు­రా­యి­గా ని­లి­చి­పో­నుం­ది. పా­కి­స్థా­న్‌­లో జన్మిం­చి, ఆస్ట్రే­లి­యా జా­తీయ జట్టు­కు ఆడిన మొ­ద­టి ము­స్లిం క్రి­కె­ట­ర్‌­గా ఖవా­జా చరి­త్ర సృ­ష్టిం­చా­రు. ఇప్ప­టి వరకు 87 టె­స్టు­లు ఆడిన ఆయన 43.39 సగ­టు­తో 6,206 పరు­గు­లు చే­శా­రు. ఇం­దు­లో 16 సెం­చ­రీ­లు, 28 అర్ధ­సెం­చ­రీ­లు ఉన్నా­యి. అన్ని ఫా­ర్మా­ట్లు కలి­పి అం­త­ర్జా­తీయ స్థా­యి­లో 8,000 కంటే ఎక్కువ పరు­గు­లు సా­ధిం­చా­రు. 2023లో ఐసీ­సీ ‘మె­న్స్ టె­స్ట్ క్రి­కె­ట­ర్ ఆఫ్ ది ఇయర్’ అవా­ర్డు­ను అం­దు­కో­వ­డం ఉస్మా­న్ ఖవా­జా కె­రీ­ర్‌­లో అత్యు­న్నత ఘట్టం.

మరీ ఇంత వివక్షా..

" జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే వారికి సానుభూతి దక్కేది. అయ్యో పాపం జోష్, నాథన్ లయన్ అనేవారు. కానీ నేను గాయపడితే మాత్రం భిన్నంగా వ్యవహరించేవారు. నాదే తప్పన్నట్లుగా చూసేవారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్ ముందు రోజు రాత్రి తప్ప తాగి గాయపడినా వారిని ఒక్క మాట కూడా అనేవారు కాదు. కానీ నా విషయంలో మాత్రం వేరుగా వ్యవహరించేవారు. ఈ విషయంలోనే నేను ఎక్కువగా బాధపడ్డాను." అని ఖవాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News