India Womens Cricket : కొత్త చరిత్ర.. అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి భారత్

Update: 2025-02-01 08:00 GMT

కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ భాగంగా సెమీస్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా భారత బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ జట్టు టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. డేవినా పెర్రిన్ (40), కెప్టెన్ అబి నార్లోవ్ (30) తప్ప మిగతా బ్యాట్స్మన్లు అంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే వెనుదిరిగారు. దీంతో, ಆ జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3, పరనికా సిసోడియా 3, ఆయుషి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మన్ లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు కమలిని 50 బంతుల్లో 56 పరుగులు, సనిక చల్కే 12 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష మరోసారి రాణించి 29 బంతుల్లో 35 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 15 ఓవర్లలోనే 117 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టు ఫిబ్రవరి 2న ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. 

Tags:    

Similar News