ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా అయ్యర్ చరిత్ర సృష్టించారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2024లో కోల్కతా నైట్రైడర్స్ను ఆయన ఫైనల్కు తీసుకెళ్లారు. టోర్నీ చరిత్రలో మరే కెప్టెన్ రెండు జట్లను ఫైనల్కు చేర్చలేదు. కాగా ఈ సీజన్లో అయ్యర్ నిలకడగా రాణించారు. ఇప్పటివరకు ఆయన 345 పరుగులు సాధించారు.
మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది కోల్కతా నైట్ రైడర్స్. ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 రన్స్కే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 55), క్లాసెన్ (21 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 32), కమిన్స్ (24 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
ఆ తర్వాత కోల్కతా 13.4 ఓవర్లలో 164/2 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయాస్ 24 బంతుల్లో 58 పరుగులతో అద్బుతమైన స్కోరుతో ముందుండి నడిపించాడు. వెంకటేష్ అయ్యర్ కూడా క్రీజులో నాటౌట్గా నిలిచి 28 బంతుల్లో 51 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. స్టార్క్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం రాజస్తాన్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ విన్నర్తో హైదరాబాద్ శుక్రవారం రెండో క్వాలిఫయర్ ఆడుతుంది.